తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం చదవాలని,రాజ్యాంగం తోనే సామాజిక సాధికారత సాధ్యమవుతుందని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు అధ్యక్షతన ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ మూల వాసులైన బహుజనులకు మానవ హక్కులు నిరాకరించబడి జంతువుల కంటే హీనంగా చూడబడుతూ అంటరానితనం అసమానత వేళ్ళూని ఉన్న సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మార్పును కోరుతూ ఎన్నో హక్కులను సాధించడం వల్లనే ఈనాడు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకే కాకుండా అగ్ర కులాలలోని పేదలకు,మహిళలకు కూడా హక్కులు కల్పించబడ్డాయని,ఉదాహరణకు విద్యా హక్కు,స్వేచ్ఛగా మాట్లాడే హక్కు,ఆస్తి హక్కు,ఓటు హక్కు,మతస్వేచ్ఛ వంటి ఎన్నో హక్కులు పొందుతున్నామని,26 నవంబర్1949 భారత రాజ్యాంగం ఆమోదించబడిన ఘనమైన రోజు అని ప్రతీ భారతీయ పౌరుడు గర్వంగా నేటి రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజాస్వామ్యం,భారత రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగం మీద విమర్శలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తిపై ఉందని రాజ్యాంగాన్ని మన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకోవాలని,అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్,ప్రమోద్,కుంపటి శివ,బిట్టు,నీలా,స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ