Tuesday, 28 July 2026 08:27:23 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి ప్రైవేట్ కాన్వేయన్స్ డ్రైవర్ల వేతనాలు ఏఐటియుసి ఆధ్వర్యంలో పెంపుదల, వాహన యజమానులతో కుదిరిన ఒప్పందం.

Date : 17 October 2025 08:17 PM Views : 392

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో అధికారులకు కన్వేయన్స్ వాహనాలు పై పనిచేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటు డ్రైవర్ల వేతనాలను పాత వాహనాలకు ప్రస్తుత వేతనాలపై 12%, నూతనంగా వచ్చిన హోండా సిటీ వాహనాల డ్రైవర్లకు నెలకు 18000/- చొప్పున వేతనాలు చెల్లించేట్లుగా ఒప్పందం కుదిరిందని దీనికి సహకరించిన ప్రైవేటు వాహన యజమానులకు, ఐక్యంగా నిలబడిన డ్రైవర్లకు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కేడబ్ల్యు క్రిస్టఫర్ లు అభినందనలు తెలిపారు. శుక్రవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లోని ప్రాజెక్టు ప్లానింగ్ కార్యాలయం వద్ద జరిగిన వాహన యజమానులకు డ్రైవర్స్ యూనియన్ కు చర్చలలో ఒక అంగీకారానికి వచ్చి ఒప్పందం చేసుకొని అట్టి ఒప్పంద పత్రాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు యర్రగాని కృష్ణయ్య, కె డబ్ల్యూ కిస్టాఫర్ మరియు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి రాజేష్ లు మాట్లాడుతూ సింగరేణి కార్పొరేట్ పరిధిలో మొదటిసారిగా ఒక యూనియన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సింగరేణిలో పెండింగ్ లో ఉన్న అడక్ పేమెంట్ డబ్బులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని,ప్రతి నెల బిల్లులు పెండింగ్ లో లేకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంలో ప్రతి సంవత్సరం దసరా నుండి దసరాకు 500/- చొప్పున పెంచాలని, డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి ఒక జత యూనిఫామ్ బట్టలు ఇవ్వాలని, ప్రజల ప్రతినెల 7వ తేదీ నుండి పదవ తేదీలో గా వేతనాలు చెల్లించాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఒప్పందం జరిగినట్టుగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం జీవోలను సవరించినప్పుడు తిరిగి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమంలో వాహన యజమానులు అసోసియేషన్ తరపున పి రాజేష్, రాము, ప్రభాకర్ రెడ్డి, కే రామానుజము, కే శ్రీనివాస్, జి నగేష్, డి సునీల్, డ్రైవర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జై మధు కుమార్, ఈ ప్రవీణ్ కుమార్ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రామకృష్ణ, సతీష్,రహిమాన్, వంశీ,రామస్వామి, పూర్ణ, ముక్తార్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :