తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ 10 వ వార్డు అంబేద్కర్ చమన్ లో జరిగిన వార్డు సభ విజయవంతంగా ముగిసింది*ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ అర్హులైన పేదలందరికీ న్యాయం చేసే దిశగా రైతు భరోసా, భూమిలేని కాయ కష్టం చేసేనిరుపేదలకు సంవత్సరానికి 12 వేలు, అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం, ఉగాది తర్వాత అర్హులైన వితంతు వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు , ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని వెంట ఒకటి అమలు చేయటం జరుగుతుందని చెప్పారు. పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అను నిత్యం శ్రమిస్తున్న స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని ఒప్పించి మంజూరు చేయించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రులు మల్లు బట్టి విక్రమ మార్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో ఓపికతో శ్రమకోర్చి ఇల్లులు తిరిగి లబ్ధిదారులను గుర్తించిన ఎంక్వయిరీ అధికారులను అభినందించారు. 10 వ వార్డులో 320 మందికి ఇందిరమ్మ ఇంటికి స్థలాలు లేనివారి అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 26 మందికి స్థలాలు ఉన్నవారి జాబితాలో అర్హులుగా గుర్తించారు , 59 మంది కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు, మరో 73 మంది కుటుంబ సభ్యులనురేషన్ కార్డుల్లో పేర్లు యాడింగ్ చేసి అర్హుల లిస్టులను గ్రామసభలో చదివి వినిపించి అర్హుల జాబితాను గ్రామసభ వద్ద గోడకు వార్డు ప్రజలకుసమాచారం నిమిత్తం అతికించడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇండ్ల కోసం 95 దరఖాస్తులు మరియు రేషన్ కార్డుల కోసం 110 దరఖాస్తులను అధికారులు ప్రజల వద్ద నుండి స్వీకరించడం జరిగింది. ఈ వార్డు సభలో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ మరియు వార్డు ప్రత్యేక అధికారి రెవెన్యూ ఆర్ఐ సూర్యనారాయణ, వార్డు ఆఫీసర్ రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేడిపల్లి కవిత సబ్బని పాపారావు రామ్ రాకేష్ టు టౌన్ ఏ ఎస్ ఐ ఎస్తేరి మేరి, మరియు వార్డ్ ఆర్పి బానోత్ జానకి అంగన్వాడి టీచర్లు ఎన్ సరోజ, నీలవేణి ,శానాజ్ బేగం నాయకులు మునగడప వెంకటేశ్వర్లు, ఉప్పతల శ్రీను, గుంజా వెంకన్న, ఎస్కే జలీలు, ఖాన్ పెళ్లి దుర్గయ్య, ముద్దం మార్తమ్మ, మున్సిపల్ ,రెవిన్యూ అధికారులు సిబ్బంది వార్డు పెద్దలు, వార్డు ప్రజలు, మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ