తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ లో సరైన వసతులు లేక రైతులు, హమాలీలు, బయ్యర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు గతంలో హమాలీలు రైతులు శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కృషి, పట్టుదల ఫలితంగా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 3.30 కోట్ల నిధులు మంజూరు చేయబడినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు.ఈ నిధుల కేటాయింపుతో జూలూరుపాడులోని 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి, భూమి చదును, చెట్ల తొలగింపు పనులతో పాటు ఒక షెడ్డు, రెండు క్యాబిన్ల నిర్మాణం చేపట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతులు, రైతు కూలీలు, హమాలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించబడతాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ , రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే నా మొదటి లక్ష్యం. జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం కోసం నేను ప్రభుత్వం వద్ద పట్టుబట్టి కృషి చేశాను. ఇది రైతులకు, వ్యాపారులకు, హమాలీలకు చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది. ఈ మార్కెట్తో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుంద అని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ