Tuesday, 28 July 2026 12:43:31 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శాశ్వత వ్యవసాయ మార్కెట్ కోసం పది ఎకరాల విస్తీర్ణంలో 3.30 కోట్లనిధులు మంజూరు, రైతులు, రైతు కూలీలు సంబరాలు .

Date : 12 September 2025 09:35 PM Views : 558

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ లో సరైన వసతులు లేక రైతులు, హమాలీలు, బయ్యర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు గతంలో హమాలీలు రైతులు శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కృషి, పట్టుదల ఫలితంగా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 3.30 కోట్ల నిధులు మంజూరు చేయబడినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు.ఈ నిధుల కేటాయింపుతో జూలూరుపాడులోని 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి, భూమి చదును, చెట్ల తొలగింపు పనులతో పాటు ఒక షెడ్డు, రెండు క్యాబిన్ల నిర్మాణం చేపట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతులు, రైతు కూలీలు, హమాలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించబడతాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ , రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే నా మొదటి లక్ష్యం. జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం కోసం నేను ప్రభుత్వం వద్ద పట్టుబట్టి కృషి చేశాను. ఇది రైతులకు, వ్యాపారులకు, హమాలీలకు చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది. ఈ మార్కెట్‌తో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుంద అని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :