Tuesday, 28 July 2026 06:12:05 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బూర్గంపహాడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి

Date : 09 December 2025 05:12 PM Views : 205

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులు, పంపిణీ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. ఎన్నికల విధానాలు, సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా పరిశీలకులు బూర్గంపహాడ్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి, టోకెన్లు, బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర వనరుల పంపిణీపై అక్కడి అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు సమయపాలనతో, శాస్త్రీయంగా, గందరగోళం లేకుండా చేపట్టాలని సూచించారు. మోరంపల్లి బంజార జడ్‌పీహెచ్‌ఎస్, పినపాకపట్టినగర్ జడ్‌పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ సౌకర్యాలను పరిశీలించి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు వినియోగదాయకమైన విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పారు. అనంతరం పరిశీలకులు మోరంపల్లి బంజార, అలాగే యెల్లందు క్రాస్ రోడ్ – కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సందర్శించారు. చెక్‌పోస్ట్‌లలో డ్యూటీలో ఉన్న అధికారులతో మాట్లాడి, ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, మద్యం రవాణా వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలను కట్టడి చేయడానికి ప్రతి వాహనాన్ని కచ్చితంగా మరియు పారదర్శకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏ వాహనం కూడా తనిఖీ లేకుండా పంపితే బాధ్యత సంబంధిత అధికారులదే అవుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత మండల అధికారులతో పాటు పోలీస్ విభాగం, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :