Tuesday, 28 July 2026 01:13:53 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 09 February 2026 07:55 PM Views : 137

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత తనిఖీ అధికారులను ఆదేశించారు.ఆహార వ్యాపారం నిర్వహించే ప్రతి దుకాణదారుడికి అవసరమైన లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత శిక్షణ కేంద్రాల ద్వారా వారికి ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, వాటికి గల స్థానిక కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఎక్కువగా ఎలాంటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని తెలిపారు.మొదటి దశలో జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ/ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారిపై ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, వినియోగదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, సేంద్రియ ఉత్పత్తులు, మిల్లెట్స్ ఆధారిత ఆహారాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆహార పదార్థాల్లో రసాయనాల సాంద్రతను గుర్తించేందుకు చేపట్టాల్సిన పరీక్షల విధానాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రాబోయే శ్రీరామనవమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాల్స్, హోటళ్ల యజమానులకు ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా నాణ్యత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మధువరం ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :