Wednesday, 29 July 2026 05:49:38 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.

Date : 27 July 2026 04:42 PM Views : 47

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం.పాత్రికేయవృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.ఘనంగా 43 వసంతాల విజయోత్సవ వేడుక తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కొలువై ఉన్న జిల్లాలో, భూమాత ప్రసాదించిన బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందులో జర్నలిస్టుగా పనిచేయటం ఎంతో అదృష్టం అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ అన్నారు. 1983లో ఇల్లందులో అడుగుపెట్టి జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన సూర్యనారాయణ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం 43 సంవత్సరాల విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చిన్నప్పటినుండి తనకు జర్నలిజం అంటే చాలా ఇష్టమని పేర్కొంటూ తన పాత్రికేయ ప్రయాణం ఇల్లందులోనే ప్రారంభమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి, సమాజానికి విశేషమైన సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయవృత్తి తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనే తన పాత్రికేయవృత్తి ప్రారంభమైందని, ఈ రెండు దినపత్రికలు తనను ఒక మంచి పాత్రికేయునిగా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉండేవారని, జర్నలిస్టుల పట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం ఉండేదని, అప్పట్లో జర్నలిస్టుగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉండేదని అన్నారు. 1983లో ఇల్లందులో ఒక చిన్న మొక్కగా ఉన్న పాత్రికేయరంగం నేడు ఒక మహావృక్షంగా మారిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికారంగంలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేడు పత్రికారంగంలో సాంకేతిక విజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసాలు లేకుండా జర్నలిస్టులు వార్తావిశేషాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాత్రికేయరంగంలో అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అన్నారు. రానున్నకాలంలో మీడియారంగం ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సుదీర్ఘకాలంలో తనతో పనిచేసిన జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :