తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 6 సామాజిక సమస్యలపై తన కవిత్వం ద్వారా చైతన్యం రగిలించే ప్రజాకవులు సమాజానికి పెద్ద ఆస్థిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభివర్ణించారు.ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత,ప్రముఖ ప్రజా,ప్రకృతి కవి జయరాజ్ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా,ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు.సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు,రచయితలు ఎంతో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు..అటువంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు .ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు....సన్మానితులుగా గుర్తింపు పొందిన ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు గర్వపడే విధమైన సేవలు చేస్తున్నారని ప్రశంసించారు.
ప్రజాకవి జయరాజ్ తో పాటు వివిధ రంగాలలో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానితులుగా ఎంపిక చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు..అనంతరం ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ కేవలం కవి మాత్రమే కాకుండా,సామాజిక ఉద్యమాల యోధులని అన్నారు.ఆయన రాతల్లో ప్రతిఫలించే ప్రకృతి ప్రేమ,అంబేద్కర్ భావజాలం,మహాత్మా జ్యోతిబా ఫూలే సిద్ధాంతాలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వివరించారు. సత్కారం పొందిన వారు సామాజిక న్యాయం,సామాజిక సమానత్వం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి,ప్రజల్లో చైతన్యం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు..ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు,సామాజిక ఉద్యమకారులు,ప్రకృతి ప్రేమికులను అభినందించారు..అనంతరం సత్కారం పొందిన సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని,సమాజంలో హక్కుల పరిరక్షణ,సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తామని భావోద్వేగంతో ప్రకటించారు...
ప్రజాకవి జయరాజ్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ సన్మానాన్ని సమాజానికి అంకితం చేస్తూ,సన్మానించిన ప్రజా సంఘాల వేదికకు,ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు,కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్,ఎస్.కె.బాసిత్,కాల్వ దేవదాస్,మొక్కల వెంకటయ్య,వేల్పుల భాస్కర్,ప్రకృతి వైద్యులు సుగుణారావు,కో-చైర్మన్ కూసపాటి శ్రీను,బిక్కసాని నాగేశ్వరరావు,యెర్రా కామేష్,మారపాక రమేష్ కుమార్,శనగ.వెంకటేశ్వర్లు, కోచర్ల కమలరాణి,చదలవాడ సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ