Tuesday, 28 July 2026 04:23:22 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా కవులు మాత్రమే ప్రజా చైతన్యం వైపు నడిపించగలరు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సన్మాన మహోత్సవంలో- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 06 July 2025 08:39 PM Views : 539

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 6 సామాజిక సమస్యలపై తన కవిత్వం ద్వారా చైతన్యం రగిలించే ప్రజాకవులు సమాజానికి పెద్ద ఆస్థిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభివర్ణించారు.ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత,ప్రముఖ ప్రజా,ప్రకృతి కవి జయరాజ్ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా,ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు.సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు,రచయితలు ఎంతో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు..అటువంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు .ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు....సన్మానితులుగా గుర్తింపు పొందిన ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు గర్వపడే విధమైన సేవలు చేస్తున్నారని ప్రశంసించారు.

ప్రజాకవి జయరాజ్ తో పాటు వివిధ రంగాలలో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానితులుగా ఎంపిక చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు..అనంతరం ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ కేవలం కవి మాత్రమే కాకుండా,సామాజిక ఉద్యమాల యోధులని అన్నారు.ఆయన రాతల్లో ప్రతిఫలించే ప్రకృతి ప్రేమ,అంబేద్కర్ భావజాలం,మహాత్మా జ్యోతిబా ఫూలే సిద్ధాంతాలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వివరించారు. సత్కారం పొందిన వారు సామాజిక న్యాయం,సామాజిక సమానత్వం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి,ప్రజల్లో చైతన్యం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు..ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు,సామాజిక ఉద్యమకారులు,ప్రకృతి ప్రేమికులను అభినందించారు..అనంతరం సత్కారం పొందిన సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని,సమాజంలో హక్కుల పరిరక్షణ,సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తామని భావోద్వేగంతో ప్రకటించారు...

ప్రజాకవి జయరాజ్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ సన్మానాన్ని సమాజానికి అంకితం చేస్తూ,సన్మానించిన ప్రజా సంఘాల వేదికకు,ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు,కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్,ఎస్.కె.బాసిత్,కాల్వ దేవదాస్,మొక్కల వెంకటయ్య,వేల్పుల భాస్కర్,ప్రకృతి వైద్యులు సుగుణారావు,కో-చైర్మన్ కూసపాటి శ్రీను,బిక్కసాని నాగేశ్వరరావు,యెర్రా కామేష్,మారపాక రమేష్ కుమార్,శనగ.వెంకటేశ్వర్లు, కోచర్ల కమలరాణి,చదలవాడ సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :