Tuesday, 28 July 2026 08:10:46 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మణుగూరు MJPTC BC హాస్టల్‌లో జరిగిన ఆహార విషబాధ (Food Poisoning) ఘటనపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి.

Date : 10 March 2026 08:28 PM Views : 207

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) ఈ రోజు మణుగూరు ఏరియా ఆసుపత్రిని సందర్శించి, మణుగూరు MJPTC BC హాస్టల్‌లో జరిగిన ఆహార విషబాధ (Food Poisoning) ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది. వారిలో 16 మంది విద్యార్థులను మణుగూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఒక విద్యార్థికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి హాస్టల్‌కు పంపించారు. మిగతా విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్థిరంగా ఉన్నారు. వారిని ఏరియా ఆసుపత్రి బాల వైద్య నిపుణుడు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.సందర్శన సందర్భంగా DM&HO విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు తీసుకున్న ఆహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వారికి ఎదురైన లక్షణాల గురించి ఆరా తీశారు. ఎక్కువగా విద్యార్థులు వాంతులు మరియు కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.తదుపరి DM&HO మణుగూరు లోని MJPTC BC హాస్టల్‌ను సందర్శించి, అక్కడ RBSK బృందాలు మరియు PHC మణుగూరు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా హాస్టల్ స్టాఫ్ నర్స్‌కు విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే సమీపంలోని వైద్య అధికారులకు సమాచారం అందించాలని, అవసరమైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స (First Aid) అందించేలా చర్యలు తీసుకోవాలని DM&HO సూచించారు.ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :