Tuesday, 28 July 2026 09:48:26 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి – టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ .

Date : 13 November 2025 08:29 PM Views : 291

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి అని టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ అన్నారు.ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం, తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి శక్తి అభివృద్ధి సంస్థ (TGREDCO) ఛైర్మన్ ఎ. శరత్, ఐఏఎస్ (రిటైర్డ్) ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన మరియు సౌర శక్తి వినియోగంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగ విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపులు మొదలైన చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.ఛైర్మన్ ఎ. శరత్ మాట్లాడుతూ, పీఎం కుసుమ్ పథకం కింద అమలవుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. సౌర శక్తి వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు మెరుగుపడతాయని, రైతులు శాశ్వతంగా లబ్ధి పొందుతారని తెలిపారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద బోర్లు వేయడానికి తగిన ప్రదేశాలను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించాలని ఆదేశించారు. భూగర్భ జలాల లభ్యత, భూసర్వే నివేదికలు, రైతుల సాగు అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతిక నిపుణుల సూచనలతో బోర్లు వేయాలని ఆయన సూచించారు.జిల్లాలో మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి మరియు మణుగూరు మండలం ఉడతనేని గుంపులో స్థలాలు కేటాయించబడ్డాయని, వీటి స్థాపనకు అవసరమైన చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా మోడల్ సోలార్ గ్రామాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో 80 గ్రామాలను గుర్తించారని, అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగుల పల్లి గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రామంలో అన్ని ఇళ్లకు సోలార్ సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.అదేవిధంగా, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఎ. శరత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ప్రభుత్వ భవనాల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాక, అవి పర్యావరణానికి అనుకూల నమూనాలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఛైర్మన్ ఎ. శరత్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యుత్ శాఖ అధికారి మహేందర్, టి జి ఆర్ జి డి సి ఓ జిల్లా మేనేజర్ రాజేందర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :