Tuesday, 28 July 2026 05:57:53 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య – ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 07 July 2026 05:07 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం సుజాతనగర్ మండలంలో పర్యటించి ప్రభుత్వ పాఠశాల పనితీరుతో పాటు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సుజాతనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్, విద్యార్థుల హాజరు, బోధన తీరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, నాణ్యమైన, పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకుని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో మాట్లాడారు. గ్రామంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు, విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోల సంఖ్య, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులు స్పందిస్తూ గ్రామంలో ఇప్పటివరకు 1,400 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు వివరించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీతో పాటు ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ నిర్ణీత గడువులోగా ఫారాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిని బీఎల్‌వోలు తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు . అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం చూపాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఈ కీలక కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అధికారులు, బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించి ఓటర్ల జాబితా సవరణను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :