Tuesday, 28 July 2026 02:26:36 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Date : 20 August 2024 09:10 PM Views : 673

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి, నారాయణ పురం,వినాయక పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి. అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కల్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణా రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు.. కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు.. ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.. ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము.అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయిన ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదు కనీసం ప్రతి పక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అటవీశాఖ అధికారులను భూ సర్వే విషయంలో రైతులతో అతి ఉత్సాహం చెయ్యద్దంటు చెప్పిన మంత్రి పొంగులేటి.

అనంతరం ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ పై పొంగులేటి ఫైర్.. పొంగులేటి అడిగిన ఏ ఒక్క విషయానికి సరైన జవాబు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో ఇళ్ళ పై వెళ్ళిన హైటెన్షన్ వైర్లను ఎటువంటి ఎస్టిమోషన్స్ ప్రజల పై వేయకండ డిపార్ట్మెంట్ నుండే క్లియర్ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు వైద్యులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని, హాస్పటల్ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అలసత్వం ప్రదర్శించిన వైద్యులు లేదా వైద్య సిబ్బంది పై కఠిన చర్యలుతీసుకుంటామని వైద్యశాఖ అధికారులను హెచ్చరించారు. విద్యాశాఖాధికారులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా శక్తి రుణాలు అర్హులైన మహిళా సంఘాలను గుర్తించి స్థానిక శాసనసభ్యుల అనుమతితో మంజూరు చేయాలనిమంత్రి ఆదేశించారు. పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజ్,మువ్వా విజయ్ బాబు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :