తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళా సమస్యల సాధన కోసం ,మహిళా సాధికారతే లక్ష్యంగా ఉద్యమాల రూపకల్పనకు నేడు (ఆదివారం) జరిగే మహిళా భారత మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు )కొత్తగూడెం 3వ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శనివారం లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ లో జరిగిన మహిళ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో పురుషులతోపాటు సమాన విధులు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందని అలాగే మహిళలపై రోజురోజుకు హింసలు పెరుగుతున్నాయని, వీటి నుండి మహిళల రక్షణ కోసం మహిళలందరూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికల నాడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణి 2500 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని తక్షణమే అమలుపర్చి మహిళల ఆశీర్వాదాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతుల కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, అలాగే పెంచుతానని హామీ ఇచ్చిన పెన్షన్లు తక్షణమే పెంచి అమలుపరచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేడు జరిగే మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు 3వ పట్టణ మహాసభలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పట్టణ మహాసభను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ సిపిఐ శాఖ కార్యదర్శి ముద్ధం మార్తమ్మ, మహిళా కార్యదర్శి తమ్మ దుర్గ, బి పద్మ, రావి చెట్టు పద్మ ,నూరి, తేలగరి మాణిక్యమని, కత్తుల ప్రేమ వాని, భానోత్ సునీత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ