Tuesday, 28 July 2026 02:33:40 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ.

Date : 12 June 2026 06:52 PM Views : 125

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై వినియోగదారులు ప్రవక్తగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సైబర్ మోసాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బిఐ గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎస్బిఐ ఆధ్వర్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ భద్రతపై సమాచార బ్యానర్లను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. పాల్గొన్నవారికి వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, నివారణ చర్యలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వినియోగదారులలో సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం ఐదు బ్రాంచ్ లకు చెందిన బ్రాంచ్ మేనేజర్లు, సారపాక బ్రాంచ్, టౌన్ సారపాక బ్రాంచ్, భద్రాచలం బ్రాంచ్, యూబీ రోడ్ బ్రాంచ్, ఐటీడీఏ పిఓ బ్రాంచ్, పాల్వంచ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ బ్రాంచ్‌, స్థానిక శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :