తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు అశ్వరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా.... అశ్వారావుపేట మండలంలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతను నిర్వర్తించాలని అశ్వరావుపేట సీఐ నాగరాజు రెడ్డి పిలుపునిచ్చారు.చైతన్యం పేరుతో నెల రోజుల పాటు అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మూలన కోసం అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు అశ్వరావుపేట రింగ్ సెంటర్ వద్ద మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలను గురించి అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ నెల రోజుల పాటు పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు.మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని,వారిలో చైతన్యం నింపేందుకే జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అశ్వరావుపేట పట్టణంలో గంజాయి హాట్స్పాట్స్ లో నిత్యం తనిఖీలు చేపట్టడం,ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం,వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,విక్రయిస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. చైతన్యం SAY NO TO DRUGS-YES TO LIFE కార్యక్రమంలో అశ్వరావుపేట సిఐ నాగరాజు ఎస్సైలు రామ్మూర్తి అఖిల మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ