తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల కాలంలో గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుని కలిసి వారి ఆవేదన విన్నవించుకున్నారు, వెంటనే స్పందించిన శాసనసభ్యులు సింగరేణి సంస్థ చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం కి ఫోన్ చేసి సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలి అని తెలిపారు, సానుకూలంగా స్పందించిన చైర్మన్ సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు, దాని కృషి ఫలితంగా ఈ నెల 12న కొత్తగూడెం లో జరుగు మెగా జాబ్ మేళా వేదికగా సుమారు 470 మందికి ఉద్యోగ నియామకపాత్రాలు సంస్థ చైర్మన్ చేతులమీదుగా ఇవ్వనున్నారు, గుర్తింపు సంఘం ఎఐటియుసి ఎప్పటికప్పుడు యాజమాన్యం పై ఒత్తిడుతెచ్చీ కార్మికుల సమస్యలపై పోరాడుతూనే ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ