తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ (ఐక్యత ర్యాలీ) స్థానిక కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద నుండి లక్ష్మీదేవి పల్లి మండలం మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశంలోని వందలాది సంస్థానాలను వివిధ రకాల భాషలను,సంస్కృతి సాంప్రదాయాలను ఏకం చేసి ఐక్యంగా ఉంచి భారతదేశాన్ని నిర్మించిన నాయకుడు మేధావి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రతి ఒక్క పౌరుడు సర్దార్ పటేల్ గారి ఉద్దేశాన్ని గుర్తించి పౌరులందరూ దేశ అభ్యున్నతికి, అభివృద్ధికి పాటు పడలని యువతకు పిలుపునిచ్చారు,కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్,రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్,మాజీ ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్,జిల్లా మహిళా నాయకురాలు బైరి నిర్మలాదేవి,జల్లారపు శ్రీనివాసరావు,జిల్లా యువ నాయకులు యమ్మూరి శివ,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్,మండల అధ్యక్షులు,బలగం శ్రీధర్,మాలోత్ గాంధీ నాయక్,వెంకన్న యాదవ్,మరియు జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ