తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని హాస్యాస్పదంగా ఉందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.గురువారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రజలు సృష్టమైన తీర్పు ఇచ్చారని,ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు!!?.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ మయం చేశారని విమర్శించారు.2017-2018 లో గోవా,మణిపూర్, మేఘాలయ,కర్ణాటకలలో జరిగిన పరిణామాలను గుర్తుచేశారు.అప్పట్లో ముందు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి,తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారని అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.టీవీకే పార్టీకి దాదాపు మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంలో గవర్నర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడంలో బీజేపీ పాత్ర లేదా అని ప్రశ్నించారు.రాజ్యాంగ హక్కులు రాజకీయ నాయకులకు మాత్రమే కాదని,ప్రజలకు కూడా తెలుసన్నారు.ఇప్పటికైనా గవర్నర్ విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని,108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచిందని,విజయ్ మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారని,మరే ఇతర పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని,గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,ధనుంజయ్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ