Tuesday, 28 July 2026 07:54:18 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 07 May 2026 07:19 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని హాస్యాస్పదంగా ఉందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.గురువారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రజలు సృష్టమైన తీర్పు ఇచ్చారని,ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు!!?.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ మయం చేశారని విమర్శించారు.2017-2018 లో గోవా,మణిపూర్, మేఘాలయ,కర్ణాటకలలో జరిగిన పరిణామాలను గుర్తుచేశారు.అప్పట్లో ముందు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి,తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారని అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.టీవీకే పార్టీకి దాదాపు మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంలో గవర్నర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడంలో బీజేపీ పాత్ర లేదా అని ప్రశ్నించారు.రాజ్యాంగ హక్కులు రాజకీయ నాయకులకు మాత్రమే కాదని,ప్రజలకు కూడా తెలుసన్నారు.ఇప్పటికైనా గవర్నర్ విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని,108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచిందని,విజయ్ మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారని,మరే ఇతర పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని,గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,ధనుంజయ్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :