తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు 100 కేంద్రాలలో సిపిఐ బిఎల్ఎ లు, సిపిఐ శాఖ బాధ్యుల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు. రామవరం లో జరిగిన SIR ప్రక్రియలో 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని మునిగడప మాట్లాడుతూ కొత్తగూడెం వ్యాప్తంగా అన్ని డివిజన్లో సిపిఐ BLO లు,శాఖాబాద్యులు కౌంటర్లను ఏర్పాటు చేసుకొని SIR ఫామ్స్ నింపడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇంకా అవగాహన లేని ప్రజలకు ఈ ప్రక్రియపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం అభినందనీయం అని అన్నారు. అధికారులు మ్యాపింగ్ లేని దరఖాస్తుల పట్ల శ్రద్ధ వహించి ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. BLA ల, BLO ల శ్రమ ఫార్మ్స్ నింపడంలో వెలకట్టలేనిది ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బి ఎల్ ఏ లు తొగరు నరేంద్ర కుమార్, జావిద్, ఉ న్నం దాసు గడ్డ టు సిపిఐ శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్, శాఖ సహాయ కార్యదర్శి సంద శ్రీనివాస్, సీనియర్ నాయకులు బయన ఈశ్వరయ్య, సూర్మేని రామారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ