Tuesday, 28 July 2026 01:40:03 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సైన్సేస్ కి సంబంధించి అదనపు డిపార్ట్ మెంట్ల ఏర్పాటుకు చేయాలి :సీఎం కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Date : 06 November 2024 07:05 PM Views : 480

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లో ఇప్పటికే ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఆప్ గ్రేడ్ చేసి , యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగూడెంలో అనేక పారిశ్రామిక సంస్థలు ఉన్నాయని, సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉందని, అంతేకాకుండా టీఎస్ జెన్కో, నవ భారత్ వెంచర్స్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్, ఎన్ ఎం డీసీ లాంటివి ఉన్నాయని తెలియజేస్తూ, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఇంతకుముందు స్కూల్ ఆఫ్ మైన్స్) ని ఆప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులందరికీ కొత్తగూడెంయూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల చెప్పారు.అన్ని వనరులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గా అప్ గ్రేడ్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయన్నారు. అదేవిధంగా అప్ గ్రేడ్ చేసిన యూనివర్సిటీలో యూ.జి, మాస్టర్స్, పి.హెచ్.డి ప్రోగ్రాంలలో భూగర్భశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రాంలు అదనంగా చేర్చి, భూగర్భశాస్త్ర, ఖనిజశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో కెమిస్ట్రీ, మరియు జియో ఫిజిక్స్ లలో ప్రత్యేక విద్య మరియు శిక్షణని అందించాలని కోరారు. ఈ విధంగా చేసినట్లయితే ఈ విషయాలలో భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తు, మంత్రి తుమ్మల కోరిన విధంగా త్వరలోనే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా మారుస్తూ, దానికి సంబంధించిన అదనపు డిపార్ట్ మెంట్లను కూడా చేర్చడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :