తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రి నుండి సూర్య ప్యాలెస్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చకచకా నడుస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి ని సంకల్ప దీక్షతో ముందుకు తీసుకెళ్తున్న MLA కూనంనేని సాంబశివరావు ఎప్పుడో నిర్మించాల్సిన ఈ సెంట్రల్ లైటింగ్ పనులను వారి ఆదేశాలతో వేగంతో నడుస్తున్నయి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రాత్రి వేళల్లో రోడ్డు పై ప్రయాణించడం సురక్షితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. అలగే భజనమందిరం పక్కన ఉన్న రహదారి ని కూడా రైల్వే గేట్ పెట్టి రవాణా సౌకర్యం కల్పిస్తే కూలీలైన్, గాజులరాజం బస్తీ, బూడిదిగడ్డ హనుమాన్ బస్తీ, వారికి పోస్టాఫీసు దరికి వెళ్ళటానికి చాలా తక్కువ దూరం ఉంటుందని సమయం వృధా కాకుండా ఉంటుంది అని స్థానికులు కోరారు. ఇప్పుడు పోస్టాఫీసు కి వెళ్ళాలి అంటే సూపర్ బజార్, బస్టాండ్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళ వలసి వస్తుందని ఎప్పుడైనా ధర్నాలు రాస్తారోకో లు జరిగితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొత్తగూడెం ప్రజలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు , బోర్డు మెంబర్లు స్పందించాలని ప్రజలు కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ