తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 2(తెలుగు వెలుగు)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనంద ఖని నందు జరిగిన వ్యాచారచన పోటీలలో స్థానిక జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి జిల్లాస్థాయి పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థి పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలో చొప్పకట్ల హరింద్రనాథ వార్థేయ అనే పదవ తరగతి విద్యార్థి జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతిని గెలుపొందడం జరిగింది మరియు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హతను సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గెలుపొందినటువంటి విద్యార్థి మరియు అందుకు ఎంతో కృషి చేసినటువంటి ఉపాధ్యాయురాలు/ గైడ్ టీచర్ శ్రీమతి సురపనేని శాంత కుమారి అభినందించడం జరిగింది. తేదీ 03.12.2024 హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు గెలుపొందినటువంటి విద్యార్థి హాజరు కావలసి ఉన్నది.
Admin
తెలుగు వెలుగు టీవీ