తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసెంబర్ 21 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు .అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర మాట్లాడుతూ, జూలూరుపాడు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని మండలంలోని కొన్ని గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో అధిక సంఖ్యలో బాధపడుతున్నారని, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మృత్యుతో పోరాడుతున్నారని ఇటీవల కాలంలో అనంతారం గ్రామంలో కిడ్నీ వ్యాధితో ముగ్గురు చనిపోవడం జరిగిందని కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కొరకు కొత్తగూడెం ,ఖమ్మం, వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తక్షణమే జూలూరుపాడు పిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమాలు సిపిఐ మండల కార్యదర్శి గుండేపిన్ని వెంకటేశ్వర్లు, aiyf జిల్లా కార్యదర్శి sk నాగుల్ మీరా, సిపిఐ నాయకులు వల్ల మల్ల సామేలు ,sk చాంద్ పాషా,ఎల్లంకి మధు కంపసాటి నాగేశ్వరరావు, బడుగు వీరస్వామి,గార్లపాటి శివకృష్ణ, పాలెపు ప్రభాకర్, నిమ్మటూరి లచ్చయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ