Tuesday, 28 July 2026 12:39:36 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

99 రోజుల కార్యాచరణపై సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ – ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 10 March 2026 08:13 PM Views : 231

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని, సిట్టింగ్ సామర్థ్యాన్ని, భోజన ఏర్పాట్లకు కేటాయించిన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం సభా ప్రాంగణంలో సరిపడా సిట్టింగ్‌ను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే విధంగా సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలతో అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగా పరిశీలించి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన శిక్షణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, కార్యక్రమం నిర్వహణ కోసం ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు తెలిపారు.శిక్షణ శిబిరం వద్ద అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌తో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమర్థ వినియోగం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణ అమలు విధానం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య,డీపీఓ సుధీర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :