Tuesday, 28 July 2026 03:18:55 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 January 2026 07:56 PM Views : 182

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిబ్రవరి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన రంజాన్ మాసంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మసీదు ఆవరణల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిశుభ్రతను కాపాడాలని పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీటి సరఫరా నాణ్యతను మెరుగుపర్చేందుకు బావులు, నీటి ట్యాంకులను శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలని సూచించారు.రంజాన్ మాసంలో ప్రార్థన సమయాలను దృష్టిలో ఉంచుకొని రెండు పూటలా త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి మసీదు పరిధిలోని లైన్‌మన్ ఫోన్ నంబర్లను మసీదు పెద్దలకు అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.ప్రార్థనా మందిరాల వద్ద అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రార్థనా మందిరాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాలు తదితర నిత్యావసర వస్తువులు సరిపడా అందుబాటులో ఉండేలా డైరీ అభివృద్ధి శాఖ అధికారులతో సమన్వయం చేసి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉన్న అన్ని మసీదులు, వాటి మత పెద్దల పూర్తి వివరాలను సంబంధిత శాఖలు సమర్పించాలని కోరారు.రంజాన్ మాసం సందర్భంగా ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు కలగకుండా దుకాణాలు ఎక్కువ సమయం తెరిచి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంతో ప్రజలందరూ ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్, పోలీస్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు,జిల్లా అదనపు వైద్య అధికారి, కొత్తగూడెం పాల్వంచ ఇల్లందు మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :