తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రంథాలయాల అభివృద్ధి ద్యేయంగా పని చేస్తున్న చైర్మన్ పసుపులేటి వీరబాబు. జిల్లా గ్రంథాలయ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా సుజాతనగర్ మండలం సర్వారం గ్రామంలో గ్రామపంచాయతీ నందు నూతన గ్రంథాలయం పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగినది గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అత్యంత చొరవ తీసుకొని పబ్లిక్ రీడింగ్ రూమ్ మంజూరు చేసారు.గ్రంధాలయలు దేవాలయాలని గ్రంథాలయాలు ఉపయోగించుకోవడం వల్ల మనిషి సమాజంలో ఒక మంచి ఆలోచనపరుడుగా మారడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థినీ విద్యార్థులకు భవిష్యత్తు పునాదులు వేసుకోవడానికి మార్గాలు అని సమాజంలో ఒక మనిషి మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవాలంటే గ్రంథాలయాలు అందులో ఉండే పుస్తకాలు పాత్ర అతి ముఖ్యమైనది అని పసుపులేటి వీరబాబు అన్నారు అత్యంత చొరవ తీసుకొని గ్రంథాలయ ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాటుకు గ్రంథాలయ కార్యదర్శి కే కరుణ కుమారి సహాయ సహకారాలను అందించారు సర్వారంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంది అని సర్పంచ్ సునీత సంతోషాన్ని వ్యక్తపరిచారు. గ్రంథాల ఏర్పాటు చేయడంతో పని పూర్తి కాలేదని పౌరులు గ్రామ ప్రజలు దాన్ని వినియోగించుకున్నప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు, గ్రంథాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పుస్తకాలు అందించి సమాజ అభివృద్ధి పాటుపడాలని వీరబాబు గారు సూచించారు టి పి సి సి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధిలో వీరబాబు చేయుచున్న అభివృద్ధి రాష్ట్రంలోని మంచి పేరు పొందిందని గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం అభినందనీయం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వారం సర్పంచ్ సునీత, సహకార సొసైటీ మాజీ చైర్మన్ మంద వీర హనుమంతు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఆఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ