తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు ఈ నెల 31న పదవీవిరమణ పొందనున్న సందర్భంగా సోమవారం ఉదయం ఆర్సీహెచ్పీ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని జీఎం షాలెంరాజుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియా అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలులో షాలెంరాజు అందించిన సేవలు విశేషమని కొనియాడారు.కార్మికుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, యాజమాన్యం–కార్మికుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పరస్పర సహకారంతో పనిచేసే వాతావరణాన్ని కల్పించడం ద్వారా కొత్తగూడెం ఏరియా అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.పదవీవిరమణ అనంతరం కూడా షాలెంరాజు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, ఆయన సేవలు సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఎస్) ఆర్సీహెచ్పీ హెచ్వోడి జె. లింగ, ఈఈ యశస్వి, ఎస్వో టు జీఎం గోవిందరాజు, ఏరియా ఇంజనీర్ రామకృష్ణ, ఆఫీస్ పీఓఏ శ్రీమతి పి. వీరభద్రమ్మ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అనిల్, యోగేంద్రనాథ్, అనూష, ఎఐటీయూసీ సహాయ కార్యదర్శి జె. గట్టయ్య, నాయకులు ఎం. సురేందర్, యు. శివదర్శన్, ఎస్. నాగేశ్వరరావు, ఆర్. మురళి, జి. రాంబాబు, టి. రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు కే. కుమారస్వామి, ఎస్. సాంబశివరావు, సమ్మయ్య, బీఎంఎస్ నాయకుడు రవి, హెచ్ఎంఎస్ నాయకుడు పూర్ణ, అలాగే ఆర్సీహెచ్పీ, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ