తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల నియంత్రణలో మున్సిపల్ కమిషనర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.శనివారం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో విచ్చల విడిగా ఫ్లెక్సీలు అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,అదేవిధంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు అమరవీరుల స్థూపం కనిపించకుండా మరియు పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం ముందు మరియు విగ్రహం చుట్టు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు,తోరణాలు ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారని, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఆ మహనీయుడి విగ్రహం కనిపించకుండా తోరణాలు ఏర్పాటు చేయకూడదనే సోయి కూడా లేకుండా ఫ్లెక్సీలు,తోరణాలు కడుతున్న రాజకీయ పార్టీల వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి బస్టాండ్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మరియు పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏవిధమైన ఫ్లెక్సీలు,తోరణాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యెడల చట్టరీత్య చర్యలు తీసుకోవాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ