తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజారా గ్రామానికి చెందిన వంగాల ఉదయ్ కిరణ్ (22) అనే యువకుడు మనస్తాపంతో ఎలుకల మందు (పేస్ట్) సేవించి, MGM వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు.సీతంపేట బంజారా గ్రామానికి చెందిన వంగాల శ్రీను పెద్ద కుమారుడైన ఉదయ్ కిరణ్ (22) మణుగూరులోని ముత్యాలమ్మ గుడిలో పురోహితం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన అతను మణుగూరు నుండి తన గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తండ్రి శ్రీనువ్యవసాయ పనుల నిమిత్తం ఖర్చులకు డబ్బులు అడగగా, ఉదయ్ కిరణ్ తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. దీనిపై ఉదయ్ కిరణ్ తల్లిదండ్రుల మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది.తన వల్లే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని సున్నిత మనస్కుడైన ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న ఎలుకల మందు (పేస్ట్) సేవించి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు (26-06-2026) తెల్లవారుజామున ఉదయం సుమారు 02:00 గంటల సమయంలో ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. మృతుని బంధువు కోటిలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజాతనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ