Tuesday, 28 July 2026 08:16:07 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు రైతు రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చిన సేవాలాల్ సేన జిల్లా నాయకులు.

Date : 27 July 2025 04:59 PM Views : 624

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు రైతు రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చిన సేవాలాల్ సేన జిల్లా నాయకులు. రెండు లక్షల రూపాయలు పై బడి అప్పు ఉన్న వారికి రుణమాఫీ చేయాలి. ధరావత్ సురేష్ నాయక్ జిల్లా అధ్యక్షులు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉన్న రైతు సమస్యలపై అదేవిధంగా గిరిజన సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు నేడు పుట్టేడు కష్టాలతో, ఆర్థిక భారంతో,నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వం ( కాంగ్రెస్ ప్రభుత్వం) ఎన్నికల ముందు రైతులకు అనేక రకరకాల హామీలతో వరాల వర్షం కురిపించింది.రైతు రుణమాఫీ,రైతు భరోసా పంటలకు గిట్టుబాటు ధర చేస్తామని భరోసా ఇచ్చారు.కానీ పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు.అనేకమంది రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు. అప్పుల ఊబిలో రైతులు నానాటికి మునిగిపోతున్నారు.ప్రభుత్వం నుంచి అందే రుణమాఫీ గాని అందక రాష్ట్రంలో రైతులు బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.కావున ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు యందు రైతు యొక్క అప్పుతో సంబంధం లేకుండా అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని తమరికి విజ్ఞప్తి చేస్తూ ఈ క్రింది ప్రధాన డిమాండ్ లను కూడా పరిష్కరించాలని కోరుతూ షెడ్యూల్ ఏరియా గిరిజనుల హక్కులను ప్రజా ప్రభుత్వం పరిరక్షించాలి.గిరిజనులకు ఆక్సిజన్ లాంటి జీ ఓ నంబర్ 3 కి బదులు కొత్త జీఓ ఇచ్చి చట్ట బద్ధత కల్పించాలి.జిల్లా జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు అమలు చేయండి.సీతారామ ప్రాజెక్టు నీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటి జిల్లాలలో ప్రభుత్వ క్యాన్సర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జిల్లాలలో ఎక్కడ లేనన్ని ఫాక్టరీలు ఉండడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, కిషన్ నాయక్, పవన్ కళ్యాణ్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :