తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చండ్రుగొండ మండల బిజెపి పార్టీ కార్యవర్గ సమావేశంలో మండల అధ్యక్షులు భోగి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ సూచనతో ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విస్తరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి,కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ వివరించాలి.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి అన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కు అందరూ సిద్ధంగా ఉండాలి అని అన్నారు.అదేవిధంగా మండలంలో ఉన్న పలు సమస్యల గురించి రాజకీయ తీర్మానంలో పొందుపరిచారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు భూక్య కుమార్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మరకాల రవీందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గుగులోత్ మోహన్ , గడ్డం శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి జంగా సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కుక్క డపు రామారావు, చిన్నం సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు భూక్య సావిత్రి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పోలోజు వంశీకృష్ణ, బూతు అధ్యక్షులు విజయభాస్కర్, వందనము, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ