తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ నిర్వహించిన వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం–2026లో పాల్గొన్న యువతతో నేడు వర్చువల్ విధానంలో సంభాషించారు.దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మందికి పైగా మై భారత్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి తమ అనుభవాలను నమోదు చేసి, సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులతో పంచుకోవాలని, తద్వారా జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి సూచించారు.హైదరాబాద్ మై భారత్ కేంద్రానికి చెందిన భవ్య, ఉత్తరకాశిలోని హర్షిల్ లోయను సందర్శించిన తన అనుభవాలను పంచుకుంటూ, అభివృద్ధి మరియు మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల సరిహద్దు గ్రామాల్లో చోటుచేసుకున్న మార్పులను వివరించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఒకప్పుడు దేశంలోని చివరి గ్రామాలుగా భావించిన సరిహద్దు గ్రామాలు నేడు దేశంలోని తొలి గ్రామాలుగా గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు దోహదపడే ఇటువంటి అనుభవాధారిత కార్యక్రమాల్లో యువత మరింత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మేరా యువ భారత్ నోడల్ అధికారి కమరతపు భాను చందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రధానమంత్రి నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ