Tuesday, 28 July 2026 03:18:31 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలి.

Date : 02 June 2026 06:09 PM Views : 59

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ/వార్డు సభలను విజయవంతం గా నిర్వహించాలి. ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా పర్యావరణ వారోత్సవాలపై సమీక్ష – గ్రామ/వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాదు నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అదే విధంగా పర్యావరణ వారోత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా, లక్ష్యబద్ధంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ/వార్డు సభలను నిర్దేశిత తేదీలైన ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో తప్పనిసరిగా నిర్వహించాలని, దానికి అవసరమైన ఏర్పాట్లు విస్తృత స్థాయిలో చేయాలని ఆదేశించారు. ఈ సభల ద్వారా ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పంటల మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని అన్నారు . వర్షాకాల సన్నద్ధతలో భాగంగా కాలువల శుభ్రత, నీటి నిల్వల నిర్వహణ, వరద నియంత్రణ చర్యలు ముందస్తుగా చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణ, గ్రామీణ పారిశుధ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి హరిత కవచాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. నిర్ణయించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. గ్రామ/వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ సభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు .పంటల మార్పిడి, వర్షాకాల సన్నద్ధత చర్యలు, పరిశుభ్రత కార్యక్రమాలు, చెట్ల పెంపకం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లాలో అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా అమలు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సిపిఓ సంజీవరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :