తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 54 కేసుల్లోని 993 కేజీల గంజాయి దాహనం ఖమ్మం జి ల్లా కొత్తగూడెం, పాల్వంచ, మణుగూర్, యేల్లెందు , అశ్వరావు పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల లోపట్టుబ డిన 993 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ జనార్థన్ అదేశాల మేరకు 54 కేసుల్లో పట్టుబడిన గంజాయిని దాహనం చేశారు. కాల్చివేనిన గంజాయి విలువ రూ. 2,48,25,000 ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తల్లేడ మండలం, గోపాల్పేట్ గ్రామంలో ఉన్న AWM కన్సటింగ్ లిమిటేడ్లో దగ్ధం చేశారు. కొత్తగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 25 కేసుల్లోని 337.790 కేజీల గంజాయిని, పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 15 కేసుల్లోని 408.371 కేజీల గంజాయిని, మణుగూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 2 కేసుల్లోని 52.520 కేజీల గంజాయిని, యేల్లెందు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 10 కేసుల్లోని 108.372 కేజీల గంజాయిని, ఆశ్వరావుపేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 2 కేసుల్లోని 37.500 కేజీల గంజాయిని దాహనం చేయించినట్లు డిప్యూటి కమిషనర్ తెలిపారు. గంజాయిని దాహనం చేస్తున్న సమయంలో డిప్యూటి కమిషనర్ జనార్థన్రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యతో పాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సీఐలు పాల్గన్నారు. ఒకవైపు గంజాయిని పట్టుకుంటూనే మరో వైపు పట్టుకున్న గంజాయిని కాల్చి వేయిస్తున్న ఖమ్మం జి ల్లా ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ