తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన కవి, రచయిత, గాయకుడు, ప్రకృతి తత్వవేత్త, ప్రముఖ అంబేద్కరిస్ట్, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు జయరాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి, కోటి రూపాయల నగదును అందించింది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు నగదు బహుమతిని సోమవారం హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించి నగదును అందించారు. జయరాజు భద్రాద్రి జిల్లాకు సింగరేణి కార్మిక ఉద్యమ నిర్మాతగా సుపరపరిచితులు. ఈ బహుమతిని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని జయరాజుకు జాతీయ బాలోత్సవ కన్వీనర్ డా. వాసిరెడ్డి రమేష్ బాబు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు.. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య, సింగరేణి ఏజీఎం గోనె శ్రీకాంత్, సింగరేణి రిటైర్డ్ జిఎం. శనగ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ మొక్కల వెంకటయ్య, మెడికేర్ అధినేత డాక్టర్ వి ఉపేందర్ రావు, డాక్టర్ కనకరాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. బి. కృష్ణయ్య, ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు ముస్తఫా, డాక్టర్ స్వామి, ప్రముఖ గాయకులు మేదర వెంకట ముత్యం, సింగరేణి డీజీఎం చంద్రమౌళి, ప్రముఖ పత్రిక బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్, ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు కేహెచ్ ప్రసాద్, కోఆర్డినేటర్ సుగుణారావు అభినందనలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ