తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.ఉద్యమ పోరుకు తలవంచిన ఢిల్లీ పీఠం.ఢిల్లీ కేంద్రంగా సాగిన విద్యార్థుల పోరాట పటిమ అభినందనీయం. నీట్ను రద్దు చేసి పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఇవ్వాలి.ఉద్యమ విరమణ హామీలను కేంద్రం తక్షణమే నెరవేర్చాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. దేశంలో కోట్లాది మంది విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థి లోకం సాగించిన వీరోచిత ఉద్యమ పోరుకు ఎట్టకేలకు ఢిల్లీ పీఠం తలవంచక తప్పలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. నీటి పరీక్షా పేపర్ల లీకుతో నష్టపోయి ఆత్మహత చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తూ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించి కూనంనేని మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు ప్రదర్శించిన అసమాన పోరాట పటిమ ఎంతో అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తును నాశనం చేసే నీట్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యమ విరమణ హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను వ్యాపారీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్యవర్గ సభ్యులు కంచర్ల జములయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, ఎస్కే ఫహిన్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, సపవట్ రవి, ఎండి యూసుఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బోయిన విజయకుమార్, బండి నరసింహ, దర్గయ్య, గడ్డం సతీష్, రాకేష్, షాహిన్, కైసర్, గోవిందు, జహీర్, పి సుధాకర్, హతిరం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ