Tuesday, 28 July 2026 05:02:41 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

యువ వికాసం గడువును పెంచాలి , దరఖాస్తులో యూనిట్ మార్పునకు అవకాశం ఇవ్వాలి : మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప డిమాండ్

Date : 12 April 2025 06:00 PM Views : 943

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరుసగా మూడు రోజుల సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి గడువును పెంచాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పదో వార్డులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14 వరకే గడువు ఉండడంతో గత మూడు రోజుల నుండి ఆన్లైన్ సెంటర్లో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన నిరుద్యోగులకు మీసేవ కేంద్రాల్లో వెబ్ సైట్ అంతరాయం ఉండటంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తక్షణమే సెలవు దినాలను దృష్టిలో పెట్టుకొని యువ వికాసం గడువును పెంచాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఆన్లైన్ చేసే సందర్భంలో జరిగిన తప్పులను అలాగే ఒక యూనిట్ బదులు మరొక యూనిట్ ఆన్లైన్లో పొరపాటున ప్రింట్ అయిన దరఖాస్తును సరిచేసుకునేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించిన తర్వాత నష్టపోయిన శెట్టిబలిజ కులం వారికి రాజీవ్ యువ వికాసంలో అలాగే ఇతర పథకాల్లో వారికి నష్టం జరిగినదని అన్నారు. తక్షణమే వారిని దృష్టిలో పెట్టుకొని కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు కలిగిన శెట్టిబలిజ కులం వారికి రాజీవ్ యువ వికాసంలో అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు తమ్మ సత్యనారాయణ, కాటంరాజు, యూత్ నాయకులు రామ్ రాకేష్ ,రమేష్, సుభాన్, భూపతి, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :