తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండడంతో సింగరేణి సంస్థ కీర్తిపశిష్టలు దెబ్బతింటున్నాయి, రిటైర్డ్ అయిన కార్మికులకి లాభాల వాటా, మరియు పిఎల్ఆర్ బోనస్ అనగా దీపావళి బోనస్ ఇవ్వటానికి క్వాటర్ క్వాలీ చేయాలని నిబంధన ఇదివరకు ఎప్పుడు సింగరేణిలో లేదు , రిటైర్డ్ అయిన కార్మికుడు క్వార్టర్ ఖాళీ చేయకపోతే ఒక గ్రాట్యూటీ మాత్రమే ఇదివరకు ఆపేవారు, కాకపోతే ప్రస్తుతం అధికారులు అనుచరిస్తున్న వ్యవహార శైలి చూస్తే కొత్త నిబంధనలు అని రిటైర్డ్ అయిన కార్మికులు క్వాటర్ ఖాళీ చేస్తేనే లాభాల వాటా, మరియు దీపావళి బోనస్ చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏఐటీయూసీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మరియు సింగరేణి సంస్థ యొక్క రూపాయలు గవర్నమెంట్ కి కోట్లల్లో ఇస్తున్నారు, విద్యుత్ సంస్థల నుండి సింగరేణి సంస్థకు వచ్చే 40 వేల కోట్లకు పైగా బకాయిలు సంస్థకి వచ్చే నిధులను మాత్రం రాబట్టడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మరియు సింగరేణి సంస్థ లేని జిల్లాలో కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు , సింగరేణిలో సంప్రదాయంగా వస్తున్న పండగ కార్మికులు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో వారి వారి ఏరియాలలో సింగరేణి అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, కాకపోతే ఈ సంవత్సరం సింగరేణి అవతరణ దినోత్సవ పండుగకి మాత్రం సంస్థలో పైసలు లేవని ఏరియా జిఎం కార్యాలయంలో మాత్రమే సింగరేణి సంస్థ యొక్క అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కావాలని తక్కువ బడ్జెట్ కేటాయించి కొంతమంది అధికారులు కావాలని కార్మికులలో రెచ్చగొట్టే పద్ధతి చేస్తున్నారు అని సంస్థ యొక్క భవిష్యత్తు నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారని భవిష్యత్తులో అధికారులు తగిన మూల్యం చెల్లించుక తప్పదని దీనిని మేము ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఒక ప్రకటనలో తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ