Tuesday, 28 July 2026 02:16:23 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

Date : 24 July 2026 07:10 PM Views : 57

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ రాజీనామా చేయాలి. కొత్తగూడెం అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర విద్యా శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం.ఈరోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను అమరవీరుల స్తూపం దగ్గర దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎ.ఐ.ఎస్.ఎఫ్, జిల్లా కార్యదర్శి వరక అజిత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగ కృష్ణ పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి జె.గణేష్, పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు అరుణ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర బి.జె.పి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మూడుసార్లు (2017,2021,2024)సార్లు నీట్ పేపర్ లీక్ జరిగింది. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా పరీక్ష ఎన్ని సార్లు లీక్ కావడం దేశ చరిత్రలో ఈ ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. పేపర్ లీక్ చేస్తున్నవారు బి.జె.పి ప్రభుత్వానికి అనుసనందంగా ఉన్నవారే అవడం గమనార్హం.22.75 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారని పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ భవిష్యత్ త్తు అంధకారంలో పడిందని, పేపర్ లీక్ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ ముట్టడికి శాంతి యుతంగా నిరసనకు వెళ్లిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసి పోలీసుల చేత విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయించిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమ్మనవేయంగా ప్రవర్తించిందని, దేశ భవిష్యత్తు మార్గదర్శకం కావలసిన విద్యార్థులు ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు తెలియజేస్తున్నారని దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించాలనీ వారు అన్నారు. నీట్ లీక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి కింద న్యాయం చేయాలని వారి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు విజయ్,జీవన్, ప్రేమ్, వినయ్,ప్రవీణ్, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు మాణిక్యాల వినయ్, గుండాల సుజన్,ఎస్.ఎఫ్.ఐ నాయకులు సాయి సంతోష్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :