తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ,స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి ఆదేశాల మేరకు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమాన్ని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈరోజు 5 /8/2024న మొదటి రోజున స్వచ్ఛ ధనం -పచ్చదనం పై అవగాహన కల్పిస్తూ మనకోసం మనం, మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రం చేసుకుందాం! మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం !అని ఆమె ప్రజలకి విజ్ఞప్తి చేశారు ..ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నుండి 9వ తారీఖు వరకు నిర్వహించబడుతుందని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానంతో పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుందామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తడి పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ వారిచ్చిన తడి, పొడి చెత్త బుట్టలలో తడి పొడి చెత్తను వేరు చేసి
మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు .అలాగే మన ఇంట్లోని కూలర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండా ,హౌస్ లో నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవాలని తద్వారా దోమల లార్వా గుడ్లు పెరగకుండా నివారణ చేసుకుని మలేరియా, డెంగ్యూ ,టైఫాయిడ్ జ్వరాల నుండి రక్షణ పొందాలని ప్రజలకు వివరించారు .అనంతరం స్వచ్ఛ వాహనంతో నెహ్రూబస్తీ వీధుల్లో ర్యాలీ నిర్వహించి శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రామ్మూర్తి ,నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ సరోజ ,నీలవేణి ,షహనాజ్ బేగం, ఆయాలు వెంకటలక్ష్మి ,కౌసల్య, నాగవాణి, మహిళ సంఘం నాయకురాలు మార్తమ్మ ,మంగమ్మ ,హేమలత, రుక్యాభి ,యూత్ నాయకులు జావిద్ ,వాసం బాబు, సందీప్, శానిటేషన్ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ