Tuesday, 28 July 2026 03:33:27 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

10వ వార్డులో స్వచ్ఛ ధనం పచ్చదనం

అవగాహన ర్యాలీని ప్రారంభించిన కౌన్సిలర్ మునిగడప పద్మ

Date : 05 August 2024 08:50 PM Views : 720

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ,స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి ఆదేశాల మేరకు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమాన్ని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈరోజు 5 /8/2024న మొదటి రోజున స్వచ్ఛ ధనం -పచ్చదనం పై అవగాహన కల్పిస్తూ మనకోసం మనం, మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రం చేసుకుందాం! మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం !అని ఆమె ప్రజలకి విజ్ఞప్తి చేశారు ..ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నుండి 9వ తారీఖు వరకు నిర్వహించబడుతుందని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానంతో పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుందామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తడి పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ వారిచ్చిన తడి, పొడి చెత్త బుట్టలలో తడి పొడి చెత్తను వేరు చేసి

మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు .అలాగే మన ఇంట్లోని కూలర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండా ,హౌస్ లో నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవాలని తద్వారా దోమల లార్వా గుడ్లు పెరగకుండా నివారణ చేసుకుని మలేరియా, డెంగ్యూ ,టైఫాయిడ్ జ్వరాల నుండి రక్షణ పొందాలని ప్రజలకు వివరించారు .అనంతరం స్వచ్ఛ వాహనంతో నెహ్రూబస్తీ వీధుల్లో ర్యాలీ నిర్వహించి శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రామ్మూర్తి ,నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ సరోజ ,నీలవేణి ,షహనాజ్ బేగం, ఆయాలు వెంకటలక్ష్మి ,కౌసల్య, నాగవాణి, మహిళ సంఘం నాయకురాలు మార్తమ్మ ,మంగమ్మ ,హేమలత, రుక్యాభి ,యూత్ నాయకులు జావిద్ ,వాసం బాబు, సందీప్, శానిటేషన్ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :