తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ 60వ జన్మదిన సందర్బం మరియ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేక్ కటింగ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ చేసిన జిల్లా సీనియర్ నాయకులు మండల ఇంచార్జ్ చంగల గురునాధం మాదిగ అనంతరం, ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు,జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సామాజిక ఉద్యమకారుడు, మంద కృష్ణ మాదిగ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, తెలిపారు. మండల మాజీ తాజా అధ్యక్షులు దెబ్బేందల సాయికుమార్ మాదిగ మరియు చాపలమడుగు నరసింహారావు మాదిగ లు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగినది, ఈ కార్యక్రమంలో మాజీమండల అధ్యక్షులు దామెర్ల శ్రీకాంత్ మాదిగ, ప్రముఖ అంబేద్కర్ వాదులు ఇడుపుల రాజు, కంచపోగు నరసింహారావు, తంబర్ల నరసింహారావు, నీలాల ప్రదీప్, నల్లగట్ల రాము, గార్లపాటి కృష్ణ, ఇసంపల్లి కళ్యాణ్, మోదుగు రవి, దెబ్బిందల శ్రీను, ఆకాష్, సందీప్, కాకటి వెంకట్, కాకటి నరేందర్, శివ, తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ