తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 18 తెలుగు వెలుగు ) తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కరి వారి గూడెం గ్రామ శివారు నా పెద్ద వాగు నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని పోలీసు వారు అదుపులో తీసుకున్నారు. వారి వివరాలు కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ భూక్య జస్వంత్, రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన జెసిబి డ్రైవర్ పద్దం హరి మరియు సుజాతనగర్ గ్రామానికి చెందిన జెసిబి ఓనర్ రమేష్ మరియు కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ భూక్య కిషన్ లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశం కలిగి ఉండి బ్రోకర్ గా ఉండి ఇసుక తోలకాలు చేస్తున్న కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య సక్రం, ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి తోలకాలకు ఉపయోగించిన ఒక ట్రాక్టర్ మరియు ఒక జెసిబి ని అదుపులో తీసుకోనైనది జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి తెలియజేయడం జరిగినది. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మట్టి తూలకాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా ఎస్సై రవి తెలియజేసినారు
Admin
తెలుగు వెలుగు టీవీ