Tuesday, 28 July 2026 09:29:26 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా.

Date : 09 October 2025 06:41 PM Views : 269

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా:సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: గెరిల్లా పోరాట యోధుడు, ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా అని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా అన్నారు. చేగువేరా 58వ వర్ధంతిని ఏఐవైఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో శేషగిరి భవన్లో ఏర్పాటుచేసిన చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని... మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వారిని విప్లవోద్యమం వైపు మళ్ళించకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం అసాధ్యమని చే అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనే రెండు పట్టాలమీద విప్లవమనే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, తడిమట్టి ముద్ద, మార్క్సిజం మౌళిక భావనలు రెండూ ఒక్కటే అన్నారు. కుమ్మరి కళాకారుని చేతుల్లో ఆ చక్రం మీద మనిషి అవసరం కోసం వివిధ ఆకృతుల్ని రూపొందించినట్లుగా ఆయా సమాజాల భౌతిక పరిస్థితుల్ని బట్టి మార్క్సిజాన్ని అన్వయించుకోవచ్చన్నారు.ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా అంతిమంగా ప్రజల విముక్తే విప్లవకారుడి ధ్యేయం కావాలన్నారు.విత్తు నాటే ముందు వాన కురవాలి... పిడుగు పడే ముందు ఉరుము గర్జించాలి... ఒక విప్లవానికి ముందు త్యాగాలు జరిగి తీరాలని చే వ్యాఖ్యలు అనేక పోరాటాలకు అద్దం పడుతుందన్నారు. క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని, ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, భూపేష్, జావీద్, కొచ్చెర్ల రాకేష్,రణధీర్, ఇర్ఫాన్, నాదీమ్, అజయ్,రవి, విజయ్ కాంత్, త్రినేష్, షారుఖ్, సోహెల్, సంతోష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :