Tuesday, 28 July 2026 12:39:45 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 07 March 2025 06:46 PM Views : 943

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు అర్హులు మాత్రమే మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, ధరణి దరఖాస్తులపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలనకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు మరియు పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసే దరఖాస్తులు పరిశీలన చేపట్టాలన్నారు. ఎల్ వన్, ఎల్ టు,ఎల్ త్రీ లిస్టులను తయారు చేయాలని ఆదేశించారు. నివేదికలు ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎల్ వన్ లో అర్హత లేని వారిని పరిశీలించి తొలగించాలని, తొలగించడానికి గల కారణాలను నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కు అర్హత కలిగి ఉండి ఎల్ వన్ జాబితాలో పేరు రాని అర్హుల పేర్లను కూడా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎల్ టు మరియు ఎల్ త్రీ లో పేర్లు పొందుపరచడానికి గల కారణాలను కూడా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తండ్రికి పేరు వచ్చి పెళ్లి అయిన కొడుకు దరఖాస్తు చేసిన అర్హత ఉండి జాబితాలో రానటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తండ్రి పక్క గృహంలో నివసిస్తూ వివాహం అయిన కొడుకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు అర్హత కలిగి ఉంటే అటువంటి వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ఎల్ వన్ అంటే శాశ్వత ఎలిజిబిలిటీ లిస్ట్ అని అయినా స్పష్టం చేశారు. ఎంపీడీవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించి అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో జాబితాలో రాకుండా చూడాలని ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :