Tuesday, 28 July 2026 10:42:35 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నిరంతర విద్యుత్ అందించాలి.. టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 February 2025 07:50 PM Views : 717

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, రేషన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన మరియు రైతు భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ ల పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,, సంబంధిత జిల్లా అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఎం ఏ ఓ లు, ఎంసీఎస్లు, డిఇలు మరియు మిషన్ భగీరథ మరియు విద్యుత్ శాఖ ఏఈలతో టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. ప్రజల గృహ మరియు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటో జనరేటర్లు అందుబాటులో కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా పార్షియల్ సబ్ డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినందున తాసిల్దారులు మరియు మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని వ్యవసాయానికి యోగ్యం కానీ భూముల మార్కింగ్ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా ఎంత అందుబాటులో ఉంది ఎంత అవసరం పడుతుందో తగిన నివేదికల సమర్పించాలని, రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో డేల చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సాగు అవసరాలకు నీరు అందేలా ఇరిగేషన్, మండల వ్యవసాయ అధికారులు మరియు తాసిల్దార్లు సమన్వయంతో పర్యవేక్షించి చివరి రైతులకు కూడా సాగునీరు అందేలా చూడాలి అన్నారు. జిల్లాలో రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు మండల మరియు జిల్లాస్థాయిలో అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని కలెక్టర్ అన్నారు. త్రాగునీటి సరఫరా లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు మరియు పంచాయతీ సెక్రటరీలు ఏ వార్డులో ఏ పంచాయితీలో త్రాగునీటి సరఫరాకు సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను ప్రతినెల రెండు సార్లు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఎంపీలు తమ పరిధిలోని పాత మోటర్లు బాగు చేసి వాటిని అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి గ్రామంలో 10 శాతం మోటర్లు ఘనంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చేతిపంపులు ఎక్కడైతే రిపేరు ఉన్నాయో గుర్తించి వాటిని రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ ఎన్నికల అనంతరం చేపడతామని కలెక్టర్ అన్నారు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ ల స్థాపన కొరకు స్థల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :