Tuesday, 28 July 2026 05:11:45 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 May 2026 07:52 PM Views : 240

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని సమీక్షించి, ప్రతి విద్యార్థి ఈ క్యాంపులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మే 13 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని, మండలాలు మరియు పాఠశాలల వారీగా ఫెయిల్ విద్యార్థుల వివరాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల లోపాలను గుర్తించి, లక్ష్యబద్ధంగా బోధన చేపట్టి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 12 నుండి విద్యాశాఖ ద్వారా చేపట్టబడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అధికారులు తమ మండలాల్లో చేపడుతున్న చర్యలపై వివరాలు తెలియజేయగా, కలెక్టర్ తగిన సూచనలు చేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :