Tuesday, 28 July 2026 06:38:08 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రైతు నేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 14 June 2025 07:12 PM Views : 914

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 16 సోమవారం జరుగు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని, ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడునున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతువేదికలలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సోమవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణం లో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడియో మరియు వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికలకు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలను పలకాలని అధికారులకు సూచించారు. ప్రతి రైతు వేదికలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తంలో రైతు భరోసా జమ అవుతున్నదో వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతు వేదికలకు పెద్ద ఎత్తున రైతులు హాజరవుతారు కాబట్టి, రైతు వేదికల వెలుపల ఏబిసిడి డ్రైవ్ పై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక పరిధిలో మునగ సాగు చేపట్టి లబ్ధి చేకూరిన రైతులను ఆహ్వానించి వారి ద్వారా ఇతర రైతులకు మునగ సాగు ద్వారా వచ్చే లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీఎంలు కూడా హాజరు కావాలని, దాని ద్వారా వారు మహిళా సమైక్య సభ్యులకు అజోల్ల పెంపకం, బయోచార్ తయారీ, చేపల పెంపకం తదితర వాటిపై సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని కలెక్టర్ సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశం మొత్తం జిల్లా వైపు చూస్తుందని దీనికి సహకరించిన ప్రతి అధికారి, ఉద్యోగస్తులను కలెక్టర్ అభినందించారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడైతే వర్షం నీరు నిలుస్తుందో అక్కడ వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :