Sunday, 26 July 2026 11:32:29 PM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

పాల్వంచ నవభారత్ "కాలనీ"లో భారీ చోరీ..!

Date : 26 January 2025 06:43 PM Views : 3768

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం , పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు) పాల్వంచ మండలంలోని నవభారత్ కి చెందిన నవనగర్ కాలనీలోని క్వార్టర్స్ లో దొంగలు పడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. నవ నగర్ లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్, ప్రతాప్, అంజద్ పాషాల క్వాటర్స్ తో పాటు మరో ఏడు క్వార్టర్స్ లో దొంగలు చొరబడ్డారు. ఎన్బి-47 క్వార్టర్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదుని చోరులు అపహరించారు. క్వార్టర్స్ లోకి చొరబడ్డ దొంగలు ఆయా ఇళ్లల్లోని సామాగ్రిని, బట్టలను చిందరవందరగా పడవేసి హల్చల్ చేశారు. అదేవిధంగా బి-11 క్వార్టర్లో నివాసముంటున్న ప్రతాప్ ఇంట్లో సుమారు 61 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకు వెళ్లారు. బి-16 క్వార్టర్లోని అంజద్ పాషా ఇంట్లో సుమారు 8 తులాల బంగారం అపహరించు కెళ్ళారు. అదేవిధంగా మిగతా క్వార్టర్స్ లో కూడా చోరీ చోరీ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ ఆయా యజమానులు ఇంకా నవ నగర్ కు చేరుకోలేదు. సరిగ్గా ఆ క్వార్టర్స్ లో నివాసముండే యజమానులు లేని సమయాన్ని అదునుగా చూసి దొంగలు చొరబడి దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే రెండు సీసీ కెమెరాలు అమర్చారు. కాలనీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, నిఘ వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లుగా అవగతం అవుతుంది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, రామారావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంని రంగంలోకి దించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :