తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన 1994వ సంవత్సరంలో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఆయన ఎనలేని సేవలను. ఆయన ప్రతిభ ప్రతిఫలంగా 2002వ సంవత్సరంలో గ్యాలంటరీ మెడల్, ఆయన అందించిన విశిష్ట సేవలకు 2020 వ సంవత్సరంలో రాష్ట్రపతి పథకం లభించాయి. లా అండ్ ఆర్డర్ తో పాటు ఇంటెలిజెన్స్ వంటి వివిధ విభాగాల్లో ఆయన పనిచేసిన కాలంలో ప్రభుత్వం నుంచి మన్ననలు పొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ