Monday, 27 July 2026 01:03:02 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 17 February 2026 04:59 PM Views : 433

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత విభాగాధిపతులను నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల నిల్వ, పంపిణీ, రవాణా ప్రక్రియలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి భద్రత మధ్య రవాణా నిర్వహించాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి అమలు చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల ప్రాంతంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను అత్యంత జాగ్రత్తగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సంబంధిత మూల్యాంకన కేంద్రాలకు పంపించేందుకు పోస్టల్ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జవాబు పత్రాల సీలింగ్, భద్రతా తనిఖీలు, రవాణా ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, నిర్ణీత కాలవ్యవధిలో గమ్యస్థానాలకు చేరేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష నిర్వహించు రోజుల్లో ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించి, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, వైద్యశాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, పోస్టల్ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :